Weather Latest News: సెప్టెంబరు 13న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ రోజు ప్రధానంగా కింది స్థాయి గాలులు పశ్చిమ, వాయువ్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయి.


రాగల 3 రోజులకు వాతావరణ సూచన (Weather Forecast):


ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది. 


Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.  గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 6 - 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 31 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా నమోదైంది. 75 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.


ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: ఏపీ యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.


దక్షిణ కోస్తాలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు.


‘‘ఉత్తర బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం ఏర్పడుతోంది. దీని ప్రభావం వలన పశ్చిమ బంగాల్ - మధ్యప్రదేశ్ - జార్ఖండ్ ప్రాంతాల్లో మరో మూడు రోజులు భారీ - అతిభారీ వర్షాలుంటాయి. కాని మన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో నేడు సాయంకాలం అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలుంటాయి. విశాఖ నగర సివారు ప్రాంతాల్లో కూడా వర్షాలుంటాయి. మరోవైపున మిగిలిన రాష్ట్రం అంతా ఎండ వాతావరణం ఉంటుంది. నిన్న నెల్లూరు - తిరుపతి నగరాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.