Warangal Crime News: వరంగల్ నగర శివారులో స్విమ్మింగ్ పూల్‌లో మూడు శవాలు కనిపించాయి. అవి ఒకే కుటుంబానికి చెందినవి. గర్భిణీగా ఉన్న తల్లి, ఆమె ఇద్దరు కుమార్తెలు విగతజీవులుగా పడి ఉన్నారు. దాన్ని గుర్తించిన భర్త వెంటనే పోలీసులకు, బంధువులకు చెప్పాడు. వారు వచ్చి విచారణ చేస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దారుణానికి పాల్పడింది భర్తేనని, కుమారుడిని కని ఇవ్వడం లేదనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలింది. 

Continues below advertisement

పోలీసులు ఎలా గుర్తించారు?

వరంగల్‌ నగరంలో అజారుద్దీన్, భార్య ఫర్హ్‌, కుమార్తెలు ఉమేరా, ఆయేషాతో కలిసి ఉంటున్నారు. అక్కడే స్విమ్మింగ్ పూల్ అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి కుటుంబంలో మూడు మరణాలు షాక్‌కి గురి చేశాయి. సమాచారం అందుకొని అక్కడకు వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

ప్రారంభంలో అజారుద్దీన్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్‌లో తన భార్య, పిల్లలు ప్రమాదవశాత్తు పూల్‌లో జారి పడి చనిపోయారని చెప్పాడు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తే చాలా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఘటన జరగానికి కొద్ది నిమిషాల ముందే స్విమ్మింగ్ పూల్ వద్ద సీసీటీవీ కెమెరాలు ఉద్దేశపూర్వకంగానే స్విచ్ ఆప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో అజారుద్దీన్ లొకేషన్ పూల్ వద్దే ఉన్నట్టు టెక్నికల్‌ ఎవిడెన్స్ ద్వారా తేలింది. పోలీసులు విచారిస్తున్న సమయంలో అజారుద్దీన్ చెప్పిన మాటల్లో పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చింది. 

Continues below advertisement

ప్రేమ వివాహం చేసుకున్న వ్యక్తిపై ఎందుకింత కోపం ?

అజారుద్దీన్, పర్హత్‌లది ప్రేమ వివాహం. వారికి ఇప్పటికే ఇద్దరు బిడ్డలు ఉన్నారు. పర్హత్ మూడోసారి గర్భవతి. అయితే మూడో సంతానం కూడా ఆడపిల్లే పుడుతుందని అనుమానపడ్డాడు. తనకు కుమారుడు కావాలని, గర్భం తీయించుకోవాలని ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు. అందుకు ఆమె నిరాకరించింది. 

మాట వినని భార్య, ఇద్దరు ఆడపిల్లలను వదిలించుకోవాలని స్కెచ్ వేశాడు. అందుకు స్విమ్మింగ్ పూల్‌లోనే స్పాట్ పెట్టారు. ప్లాన్ ప్రకారం వారిని బుధవారం స్విమ్మింగ్ పూల్ వద్దు తీసుకెళ్లి నెట్టేశాడు. వారు చనిపోయే వరకు ఎదురు చూశాడు. తర్వాత బంధువులకు మిగతా వారికి సమాచారం అదించాడు.  

ఫర్హత్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. దీంతో అతనిపై హత్యా నేరం కేసు నమోదు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే మరికొన్ని విషయాలు చెప్పాడు. భార్య చనిపోయిన తర్వాత పిల్లలను చూసుకునేందుకు ఎవరూ ఉండరని వారి కూడా చంపేసినట్టు నిందితుడు అంగీకరించాడు. అతన్ని కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్‌కు తరలించారు.