TSPSC Chairman Resignation: హైదరాబాద్‌: తెలంగాణలో ఉద్యోగ నియామకాల బోర్డు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి (Janardhan Reddy) తన పదవికి రాజీనామా చేశారు. సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కొద్దిసేపటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉత్కంఠ నెలకొంది. తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి సమర్పించగా ఆమె తక్షణమే ఆమోదం తెలిపారు. టీఎస్ పీఎస్సీ తదుపరి చైర్మన్, సభ్యుల నియామకంపై చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి శాంతికుమారికి గవర్నర్ తమిళిసై లేఖ రాశారు.