సంగారెడ్డి జిల్లా దిగ్వల్ సమీపం 65 నంబర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. క్షణాల్లో అప్రమత్తమైన ప్రయాణికులు కార్లోంచి బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు. ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న జహీరాబాద్ అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేశారు. జాతీయ రహదారిపై ఈ ఘటన జరగడంతో భారీగా ప్రయాణికులు గుమిగూడారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది…
Telangana: ఉన్నట్టుండి కారులో చెలరేగిన మంటలు…కార్లో ఉన్నవాళ్లు ఏం చేశారంటే….
ABP Desam | 12 Aug 2021 04:49 PM (IST)
జాతీయ రహదారిపై రివ్వున దూసుకుపోతున్న కారులోంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి….
కారులో మంటలు...సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు