Telangana SI and woman constable committed suicide due to extramarital affairs: కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, కానిస్టేబుల్ శృతితో పాటు  మరో యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివాహేతర బంధం కారణంగానే ఈ మూడు ప్రాణాలు కడతేరిపోయినట్లుగా పోలీసులకు ఆధారాలు లభించాయి. 

Continues below advertisement


భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ కు పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆయితే ఆయనకు కానిస్టేబుల్ శృతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అది వివాహేతర బంధానికి దారి తీసింది. ఇటీవల ఈ బంధానికి ముగింపు పలకాలని శృతి నిర్ణయించుకున్నారు. ఎస్ఐ సాయి కుమార్ కి అప్పటికే పెళ్లి అయిపోవడంతో .. తనను శారీరకంగా ఉపయోగించుకంటారు కానీ పెళ్లి చేసుకుంటారన్న నమ్మకం లేకపోవడంతో ఆమె మోర యువకుడ్ని ప్రేమించింది. కంప్యూ టర్ ఆపరేటర్ గా పని చేసే యువకుడ్ని ప్రేమించింది. క్రమంగా ఎస్ఐని దూరం పెడుతూ ఆ యువకుడికి దగ్గర అయింది.                                    



Also Read: అందంతో వల - మంత్రి నుంచి ఎంతో మంది బాధితులు - కర్ణాటక లేటెస్ట్ సెన్సేషన్ శ్వేతగౌడ