Breaking News Live: ఇవాళ సాయంత్రం దిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్, మూడు రోజుల పాటు అక్కడే!
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ABP Desam Last Updated: 03 Apr 2022 05:33 PM
Background
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో 40 నుంచి 44 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, యానాంలలో...More
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో 40 నుంచి 44 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇకనుంచి 41 నుంచి 45 డీగ్రీల మధ్యలో ఎండలు ఉంటాయని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వాతావరణ కేంద్రం కొన్నిజిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, అధిక ప్రభావం ఉండే జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర కోస్తాంధ్ర యానాంలో.. (Temperature in Andhra Pradesh)ఏపీలోకి ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణం మరింత వేడెక్కనుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎండల తీవ్రత 40 నుంచి 44 డిగ్రీల దాక ఉండనుంది. కోస్తా ప్రాంతాలు ( విశాఖ, కాకినాడ, మచిలీపట్నం) ఇలాంటి చోట్ల ఎండలకంటే ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. మంచి ఎండ వేడి, కాస్తంత తేమ ఉండటం వల్ల విశాఖపట్నం పరిసర ప్రాంతాలైన పాడేరు-బొబ్బిలి ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ప్రజలు మధ్యాహ్నం వేళ ఎండలో బయట తిరగకూడదదని, అవసరమైతే గొడుకు తీసుకుని బయటకు వెళ్లాలని, రోజుకు 5 లీటర్ల నీరు తాగాలని వాతావరణ శాఖ, వైద్య నిపుణులు సూచించారు.దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న వడగాల్పుల వల్ల ఈ రోజు చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో 40 నుంచి 44 డిగ్రీల దాక ఎండల తీవ్రత ఉంటుంది. అలాగే నెల్లూరు, కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లా (పల్నాడు ప్రాంతం) లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సీమ జిల్లాల్లో భానుడి ప్రతాపంతో ఉక్కపోత, తేమ పెరిగింది. రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కర్నూలు జిల్లా-తెలంగాణ సరిహద్దు ప్రాంతం ముఖ్యంగా నందికొట్కూరు పరిసర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. ఏపీలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 41.5 డిగ్రీలు, నంద్యాలలో 40, అనంతపురం, కడపలో 40.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ వెదర్ అప్డేట్స్..తెలంగాణలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో వైపున తెలంగాణ రాష్ట్రంలోనూ ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రానున్న రోజుల్లో మరింత ఎక్కువ ఎండలతో ఉక్కపోత, తేమ అధికం అవుతాయి. హైదరాబాద్ లో నేడు సైతం 40 డిగ్రీల ఎండ ఉంటుంది. ఎండల సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. మధ్యాహ్నం సమయం ఎండలు, వేడి గాలులు ఎక్కువగా ఉంటాయని అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని వాతావరణ కేంద్రం సూచించింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఇవాళ సాయంత్రం దిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్, మూడు రోజుల పాటు అక్కడే!
సీఎం కేసీఆర్ దిల్లీ వెళ్లనున్నారు. ఆదివారం సాయంత్రం బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం దిల్లీ వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు సీఎం కేసీఆర్ దిల్లీలోనే ఉండనున్నారు.