Telangana High Court grants bail to accuded uday kumar reddy in YS viveka murder case | హైదరాబాద్: ఏపీలో సంచలనం రేపిన మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ6 అయిన ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు కండిషన్లతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రతి ఆదివారం పులివెందుల పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలలో పేర్కొంది. వివేకా హత్య కేసులో అరెస్టైన ఉదయ్ కుమార్ రెడ్డి గత రెండున్నర ఏళ్ల  నుంచి, చంచలగూడ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బుధవారం సాయంత్రం కానీ, గురువారం ఉదయం చంచల్ గూడ జైలు నుంచి విడుదల కానున్నాడు.