Aleru MLA Gongidi Sunitha: ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. 2018 ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులు చూపకుండా.. తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని పది వేల రూపాయల జరిమానా విధించింది. ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారు. అయితే గతంలో ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులు చూపించకుండా, తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆమెపై పిటిషన్ దాఖలు అయింది.


ఈక్రమంలో హైకోర్టులో ఈ అంశం విచారణకు రాగా.. 2018కి చెందిన కేసులో ఇప్పటి వరకూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈక్రమంలోనే గొంగిడి సునీతకు 10 వేల రూపాయల జరిమానాను న్యాయస్థానం విధించింది. అక్టోబర్ 3వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. 


Read Also: Kavitha Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు భారీ ఊరట - సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఏమిటంటే ?