TS Govt : దివ్యాంగుల కోసం తెలంగాణ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం(డిసెంబరు 3) సందర్భంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. స్త్రీ, శిశు సంక్షేమశాఖలో భాగంగా ఉన్న దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమశాఖ విభాగాన్ని మంత్రిత్వ శాఖగా ఏర్పాటుచేసేందుకు నిర్ణయించింది. కొత్త మంత్రిత్వశాఖపై తెలంగాణ సర్కార్ శనివారం ఉత్తర్వులు జారీ చేయనుంది. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేకశాఖ ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దివ్యాంగుల, వృద్ధులు, ట్రాన్స్ జెండర్ల కోసం మంత్రిత్వశాఖ ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్లకు సంక్షేమం, ఇతర సేవలు అందించేందుకు వీలుగా జిల్లా స్థాయిలోనూ మహిళ, శిశు సంక్షేమ శాఖ నుంచి వీటిని వేరుచేశారు. వీటికి జిల్లా సంక్షేమ అధికారిని నియమించనున్నారు. మహిళ శిశు సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమ శాఖల మధ్య ప్రతి జిల్లాకు శాఖాపరమైన ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.