Vikas Raj Responds over Nagarjuna Sagar Issue: నాగార్జున సాగర్ డ్యాం వద్ద జరుగుతున్న హైటెన్షన్ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ స్పందించారు. రాజకీయ నేతలు ఎవరూ ఆ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని అన్నారు. డ్యాం దగ్గర జరుగుతున్న వ్యవహారాన్ని పోలీసులు చూసుకుంటారని చెప్పారు. వికాస్ రాజ్ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో ఓ పోలింగ్ కేంద్రంలో తన సతీమణితో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.