హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో తన కోర్సు విజయవంతంగా పూర్తి చేశారు. హార్వర్డ్ లోని ‘కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్’లో నిర్వహించిన వారం రోజుల ప్రత్యేక లీడర్‌షిప్ కోర్సులో చేరి పూర్తి చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆ సంస్థ నుండి అధికారికంగా లీడర్ షిప్ కోర్సు సర్టిఫికెట్‌ను అందుకున్నారు. ఈ నెల 25 నుంచి 30 వరకు జరిగిన ‘లీడర్‌షిప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ’ (Leadership for the 21st Century) అనే పేరుతో నిర్వహించిన తరగతులకు సీఎం రేవంత్ స్వయంగా హాజరయ్యారు.

Continues below advertisement

ఈ అపూర్వమైన అనుభవాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ‘ఎక్స్’ షేర్ చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 దేశాల నుంచి వచ్చిన 60 మంది విద్యార్థులతో కలిసి తాను ఈ తరగతులకు హాజరైనట్లు తెలంగాణ సీఎం పేర్కొన్నారు. ఈ లీడర్‌షిప్ కోర్సులో భాగంగా అక్కడి ప్రొఫెసర్లు, టీచర్స్, తన తోటి విద్యార్థుల నుంచి పాలనాపరమైన మెళకువలు, నాయకత్వ లక్షణాల గురించి ఎంతో నేర్చుకున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Continues below advertisement