Telangana Elections 2023: ఢిల్లీలోని ఏైఐసీసీ కార్యాలయంలో నేడు తెలంగాణ ఎన్నికలపై స్క్రీనింగ్ కమిటీ సమావేశం కాబోతుంది. ఈ కమిటీ సమావేశంలో ఛైర్మన్ మురళీధరన్, సభ్యులు జిగ్నేష్ మేవానీ, సిద్ధిఖి, ఎక్స్ అఫిషియో సభ్యులుగా రాష్ట్ర ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొనబోతున్నారు. అయితే సర్వేల నివేదికలతో ఆభ్యర్థుల వడపోత కార్యక్రమం చేపట్టబోతున్నారు. పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు సహా ఇతర సంస్థలతోనూ సర్వేలు చేయించారు.అయితే ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 34 సీట్లను కేటాయించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఏకాభిప్రాయం కుదిరితే 25 నుంచి 30 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు ఉన్న చోట మరోసారి స్క్రీనింగ్ కమిటీ దృష్టి సారించి నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఈ నెలాఖరుకల్లా అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేయాలని స్క్రీనింగ్ కమిటీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.


ఇటీవలే తుక్కుగూడ సభలో ఆరు హామీలు ప్రకటించిన కాంగ్రెస్  


రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో నిర్వహించిన తెలంగాణ విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ప్రకటించింది.








కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలు, పూర్తి వివరాలిలా" data-url="/photo-gallery/telangana/in-pics-6-election-guarantees-of-congress-ahead-of-telangana-assembly-polls-117150#image5" data-storyid="117150">



తెలంగాణ కోసం సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను చూసి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అర్ధరాత్రి నుంచి అంగీలు చింపుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని దోఖా ఇచ్చిన దగాకోరును రాబోయే 100 రోజుల్లో గద్దె దించడం గ్యారంటీ అని మండిపడ్డారు. మూడెకరాల భూమి మాట తప్పి, వేల ఎకరాలు వెనకేసిన భూబకాసురులను బొందపెట్టడం గ్యారంటీ అన్నారు. కాపలా కుక్కలాగా ఉంటానని ప్రజలను మోసం చేస్తూ, ఖజానాను కొల్లగొడుతున్న దొంగల ముఠాను తరిమికొట్టడం గ్యారంటీ అన్నారు. కమీషన్లను దండుకోవడమే  'మిషన్' లాగా పెట్టుకున్న  వసూల్ రాజాల భరతం పడతామని, పదేండ్లలో వందేండ్ల విధ్వంసం సృష్టించిన వినాశకారులను పాతరేస్తామన్నారు.  తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టిన 'గులామీ' గ్యాంగును పాతాళానికి తొక్కుతామన్నారు. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా తామే గెలుస్తామని జోస్యం చెప్పారు.