Mohammed Siraj meets CM Revanth Reddy:  టీం ఇండియా ఆటగాడు మహమ్మద్ సిరాజ్ తెలంగాణ ముఖ్యమమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా టీ  20 ప్రపంచ కప్ సాధించినందుకు సిరాజ్ ను ముఖ్యమంత్రి అభినందించి శాలువతో సత్కరించారు. సిరాజ్ ముఖ్యమంత్రికి  టీం ఇండియా జెర్సీని  బహుకరించాడు. ఈ కార్యక్రమంలో రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రి కోమటి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  కూడా పాల్గొన్నారు. 


 






టీ  20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత.. టీం ఇండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్   హైదరాబాద్‌కు చేరుకున్న  సందర్భంగా   సిరాజ్ కు గ్రాండ్‌ వెల్‌ కం లభించింది.  ముంబైలో జరిగిన విన్నింగ్ పేరేడ్ తరహాలోనే అభిమానులు లోకల్ బాయ్ సిరాజ్ కు స్వాగతం పలికారు.