హైద‌రాబాద్: అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురై ఢిల్లీలో చికిత్స పొందుతున్న సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ఢిల్లీలోని  మాక్స్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కేవీఎన్ఎస్ఎస్ ప్ర‌కాష్ వైద్య ఖ‌ర్చుల నిమిత్తం రేవంత్ రెడ్డి రూ.10 ల‌క్ష‌లు మంజూరు చేశారు. ఢిల్లీలో సాక్షి జ‌ర్న‌లిస్టుగా ప‌ని చేస్తున్న ప్ర‌కాష్ మెద‌డులో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డంతో అనారోగ్యానికి గురయ్యాడు. మూడు రోజుల క్రితం ఢిల్లీలోని ఆసుప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి త‌క్ష‌ణ‌మే స్పందించారు. ప్ర‌కాష్ వైద్య ఖ‌ర్చ‌ల‌కు ప‌ది ల‌క్ష‌లు మంజూరు చేయాల‌ని అధికారుల‌ను సోమవారం నాడు ఆయన ఆదేశించారు. ఇందుకు సంబంధించిన చెక్కును మంగ‌ళ‌వారం ఢిల్లీలో అధికారులు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు అంద‌జేయ‌నున్నారని సమాచారం.