Kamareddy Knife Attacks: కామారెడ్డి జిల్లాలో కత్తిపోట్లు కలకలం రేపాయి. జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో భగత్ సింగ్ విగ్రహ సమీపంలో ఓ ప్లాట్ విషయంలో స్వామి అనే వ్యక్తి నరేందర్ రావు, సంతోష్ అనే ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి జరిగింది. ఈ దాడిలో నరేందర్ రావు, సంతోష్ లకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కు బాధితులను తరలించారు. సమాచారం అందుకున్న దేవునిపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మరోవైపు, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో నిందితుడు స్వామి లొంగిపోయాడు.


భగత్ సింగ్ విగ్రహం సమీపంలో ఉన్న ఆ ప్లాటు విషయంలో వివాదం ఉండగా.. ఈ శనివారం ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగింది. ఈ క్రమంలో స్వామి అనే వ్యక్తి కత్తితో నరేందర్ రావు, సంతోష్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని స్థానికులు తెలిపారు.