Breaking News Telugu Live Updates: ప్రేమ పేరిట వివాహితకు వేధింపులు, కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన యువకుడు 

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP DesamLast Updated: 07 Oct 2022 07:42 PM

Background

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగనున్న మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. ఎలాగైనా ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించి, అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని అన్ని పార్టీల నేతలు భావిస్తున్నారు. నేటి (అక్టోబర్ 7)...More

ప్రేమ పేరిట వివాహితకు వేధింపులు, కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన యువకుడు 

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లిలో వివాహితపై యువకుడు కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. కొంతకాలం నుంచి సదరు వివాహితను ప్రేమిస్తున్నట్టు పెళ్లి చేసుకోవాలని యువకుడు మహిళ వెంటపడుతున్నాడు. సదరు మహిళపై కిరోసిన్ పోసి అతను కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.