Lawyer died in Telangana High Court: గుండెపోటు మరణాలు ఇటీవలి కాలంలో ఎక్కవైపోయాయి.  అప్పటి వరకూ బాగానే ఉంటారు. కానీ హఠాత్తుగా కుప్పకూలిపోతారు. ఇలాంటి మరణం తెలంగాణ హైకోర్టులోనూ చోటు చేసుకుంది. ఓ కేసు సందర్భంగా ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తున్న పసునూరి వేణుగోపాల్ అనే లాయర్ హఠాత్తుగా కుప్పకూలిపోయారు. గుండెపోటు వచ్చిందని ఇతర లాయర్లు, కోర్టు సిబ్బంది సీపీఆర్ చేసినా ప్రయోజనం లేకపోయింది. వెంటనే ప్రాణాలు కోల్పోయనట్లుగా వైద్యులు విర్ధారించారు. ఈ ఘటనతో హైకోర్టు ప్రాంగణంలో విషాదం నెలకొంది.  లాయర్ మృతి చెందడంతో కోర్టులోకేసుల విచారణలు బుధవారానికి వాయిదా వేశారు.