= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఆదివారం కడప, విశాఖపట్నం జిల్లాల పర్యటనకు ఏపీ సీఎం జగన్ అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదివారం కడప, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు.
ఆదివారం ఉదయం 11 గంటలకు కడప చేరుకోనున్న సీఎం జగన్..
పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇనిస్టిట్యూట్ను ప్రారంభించనున్నారు.
ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కుమార్తె వివాహ వేడుకలో పాల్గొంటారు
అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
అదే రోజు సాయంత్రం 4.45 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్కు సీఎం చేరుకుంటారు.
నేవల్ ఎయిర్స్టేషన్, ఐఎన్ఎస్ డేగా వద్ద.. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు స్వాగతం పలుకుతారు.
ఆ తర్వాత రాత్రి 7 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Himachal Pradesh CM: ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు. రొటీన్ హెల్త్ చెకప్ కోసం ఆసుపత్రిలో చేరినట్లు అధికారిక వర్గాల సమాచారం.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Odisha Polling: ఆంధ్రా - ఒరిస్సా సరిహద్దులోని కొఠియా గ్రామాల్లో ముగిసిన పోలింగ్ Odisha Elections: విజయనగరం. ఆంధ్రా - ఒరిస్సా సరిహద్దులోని వివాదాస్పద కొఠియా గ్రామాల్లో ఒరిస్సా ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ బూతుల దగ్గరకు ఒరిస్సా పోలీసులు ఆంధ్రా మీడియాను అనుమతించలేదు. సరిహద్దు వివాదాస్పద గ్రామాల్లో అత్యల్పంగా ఓట్లు నమోదయ్యాయి. తెలుగు మాట్లాడే పలు గ్రామాల్లో ఎన్నికలను స్వస్ఛందంగా బహిష్కరించిన నేరెళ్లవలస, దొరలతాళ్లవలస, చిన్న దొరలతాళ్లవలస, తదితర గ్రామాలు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
పల్నాడులో నాటు తుపాకీల కలకలం గుంటూరు జిల్లా పల్నాడులో కొందరు నాటు తుపాకీ హల్ చల్ చేశారు. నిందితులు గతంలో లిక్కర్ బిజినెస్ చేస్తూ బెదిరింపులకు పాల్పడేవారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రెండు నాటు తుపాకులు, మరికొన్ని మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన స్వల్ప ఘర్షణలో నిందితులు తుపాకీలతో హల్ చల్ చేశారు. మంత్రుల పర్యటన ముందురోజే పలనాడులో తుపాకీలు లభ్యం కావడం కలకలం రేపింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
G Kishan Reddy: మేడారం వనదేవతలను దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గిరిజన జాతర సమ్మక్క - సారలమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. జాతరలో భాగంగా సమ్మక్క గురువారం రాత్రి గద్దెపైకి చేరింది. చిలుకలగుట్ట నుంచి సమ్మక్క లాంఛనంగా గద్దెపైన కొలువుదీరారు. శుక్రవారం కేంద్రమంత్రి కిషన్రెడ్డి మేడారంలో పర్యటించారు. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మను కిషన్రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం నిలువెత్తు బంగారం అమ్మవార్లకు సమర్పించి కిషన్ రెడ్డి మొక్కులు చెల్లించుకున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Chandra Babu: చంద్రబాబు స్థలం కబ్జాకు యత్నం నారావారిపల్లెలో చంద్రబాబుకు చెందిన భూమి కబ్జాకు యత్నం జరిగింది. సర్వే నెంబర్ 222/5లోని 38 సెంట్లు ఆక్రమించేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు స్థలంలో కబ్జాదారులు రాతి స్తంభాలు నాటారు. 1989లో 87 సెంట్లు రిజిస్టర్ భూమి కొనుగోలు చేసి చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడు రిజిస్టర్ చేయించారు. ఆ 87 సెంట్లలో ఆస్పత్రి, కల్యాణ మండపానికి కొంత భూమిని తర్వాత చంద్రబాబు వితరణగా ఇచ్చారు. చంద్రబాబుకు చెందిన 38 సెంట్ల భూమిలో ఇప్పుడు కబ్జాదారులు ఫెన్సింగ్ వేస్తున్నారు. ఈ భూమి ఆక్రమించేందుకు యత్నించినది ఎవరో కాదు.. చంద్రబాబు పెదనాన్న కుమారుడు అయిన రాజేంద్ర నాయుడు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Panjagutta: పంజాగుట్టలో దారి దోపిడీ హైదరాబాద్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పంజాగుట్టలో గోల్డ్ షాప్ యజమాని దుకాణం మూసేసి డబ్బులు తీసుకెళ్తుండగా దృష్టి మళ్లించిన దొంగలు దోపిడికి తెగబడ్డారు. గ్రీన్ ల్యాండ్స్ దారిలో బైక్పై వచ్చిన దొంగలు బంగారం షాపు యాజమాని నుంచి రూ.3.5 లక్షలున్న రెండు బ్యాగ్లతో పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు దొంగలను వెంబడించడంతో రూ.1.5 లక్షలు నగదు ఉన్న బ్యాగ్ను రోడ్డు మీదే వదిలేసి 2 లక్షల బ్యాగ్తో పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా విచారణ జరుపుతున్నారు. నిందితులు ఎవరు, తెలిసినవాళ్ళ పనా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
MLC Kavitha: శ్రీవారిని దర్శించుకున్నఎమ్మెల్సీ కవిత దంపతులు ఎమ్మెల్సీ కవిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి నిజపాద దర్శనం సేవలో ఎమ్మెల్సీ కవిత - అనిల్ దంపతులు పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం స్వామి వారికి జరిగే నిజపాద సేవలో స్వామి వారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న కాలినడకన తిరుమలకు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత దంపతులకు అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు, స్వామి వారి పట్టు వస్త్రాలను అందజేశారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Nagar Kurnool: నాగర్కర్నూల్లో అదుపుతప్పి బోల్తాపడ్డ కారు నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. వెల్దండ మండలం బండోనిపల్లి గ్రామంలో స్నేహితుడి వివాహానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు పీఏ పల్లికి చెందిన కిరణ్మయి (22), శిరీష (20), అరవింద్ (23)గా పోలీసులు గుర్తించారు.