Telangana Latest News: తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన కుర్రాడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను సర్‌ ఫామ్‌పై రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారుతోంది. అందులో మోదీ పేరు రాసి చనిపోవడంతో ఆ లేఖ వైరల్ అవుతోంది. 

Continues below advertisement

రాచర్ల గొల్లపల్లికి చెందిన వంశీ అనే కుర్రాడు బుధవారం రాత్రి సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకోవడానికి ముందు తన చావుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కారణం అంటూ రాసుకున్నాడు. ఇదే తన చావు లేఖ అంటూ సర్‌ ఫామ్‌లోనే వాంగ్మూలం ఇచ్చాడు. సర్‌ ఫామ్‌పై ఇంకా ఏం రాశాడంటే" ఇది నా చావు లేఖ. గౌరవనీయులైన పోలీసు వారికి నమస్కారాలు. తమరు నా ఆందోళన అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నా పేరు వంశీ, నేను చనిపోవడానికి కారణం పీఎం నరేంద్ర మోదీ. అంతే కానీ నా చావుకు నా ఫ్యామిలీ మాత్రం కారణం కాదు. దయచేసి ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా, నా దహనసంస్కారాలు ఆనవాయితీగా జరిపించాలని పోలీసు వారికి కోరుకుంటున్నాను." అని రాశాడు. చివరిలో ఇట్లు భారతీయ పౌరుడు వంశీ రాయల్ అని సంతకం చేశాడు. తర్వాత జైహింద్ అని నినాదం చేసి కింద థాంక్యూ ఫర్ గవర్నమెంట్ అని రాశాడు. 

Continues below advertisement