పెట్రోల్, డిజీల్, నిత్యావసరాలు, సిలిండర్ ధరల పెంపుతో కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. మేం సామాజిక న్యాయాన్ని పాటించాం. 12 జనరల్ స్థానాల్లో 50 శాతం బీసీలకే ఇచ్చాం. పోరాటే తత్వం ఉన్న వాళ్లకు మేము సీట్లు ఇచ్చాం. బీజేపీ, కాంగ్రెస్ లు మాత్రం పారాచ్యూట్ లీడర్లకు సీట్లు ఇచ్చారు. దీంతో వాళ్ల పార్టీలోనే వ్యతిరేకత వచ్చింది. గత ఐదు నెలల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం టైమ్ పాస్ చేసింది. కాళేశ్వరం, శ్వేతపత్రం, ఫోన్ ట్యాపింగ్ పేరుతో టైమ్ వేస్ట్ చేయడంతో వారిపై అసాధారణ వ్యతిరేకత వచ్చింది. ఇప్పటినుంచైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను అమలు చేయకపోతే దారుణమైన పరాభవం తప్పదు. కాంగ్రెస్, బీజేపీలు సన్నాయి నొక్కులు నొక్కుతూ, కేసీఆర్ ను తిట్టేందుకేనని ప్రజలు గ్రహించారు- కేటీఆర్