Dead Body In Manhole: హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ యువతిని పూజారి చంపేసి మ్యాన్‌హోల్‌లో పడేశాడు. తర్వాత ఏమీ తెలియనట్టు మిస్సింగ్ కంంప్లైంట్ ఇచ్చాడు. సరూర్‌ నగర్ ప్రాంతానికి చెందిన వెంకటసాయి సూర్యకృష్ణ వృత్తి రీత్యా పూజారి. పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా వేరే మహిళతో ఏర్పడిన వివాహేతర సంబంధం చిక్కుల్లో పడేసింది. 
 
వెంకటసాయికి అప్సర అనే యువతి పరిచయం ఏర్పడింది. వరుసకు ఆమె మేనకోడలు అవుతుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. 


ఇద్దరు పిల్లలు ఉన్న వెంకటసాయి ఆమెను వదలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఆమె పెళ్లి చేసుకోవాల్సిందే అని పట్టుబట్టాడు. చివరకు ఒత్తిడి ఎక్కువయ్యేసరికి ఆమెను హతమార్చాడు. 


మూడు రోజుల క్రితం అప్సరను కారులో శంషాబాద్ సుల్తాన్ పల్లికి తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేని ప్రాంతంలో ఆమె బండరాయితో కొట్టి చంపేశాడు. తర్వాత డెడ్‌బాడీని సంచిలో కట్టి తీసుకొచ్చాడు. సరూర్‌నగర్‌లోని ఓ మ్యాన్‌హోల్‌లో పడేశాడు. 


తర్వాత రోజు ఏమీ ఎరగనట్టు తన మేనకోడలు అప్సర కనిపించడం లేదంటూ శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన మేనకోడలు ఫ్రెండ్స్‌తో భద్రాచలం వెళ్లేందుకు ప్లాన్ చేసినట్టు తెలిపారు. మూడో తేదీన తానే స్వయంగా శంషాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద డ్రాప్ చేసినట్టు కంప్లైంట్‌లో చెప్పాడు. 


అయితే అదే రోజు ఆమెను కారులో తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి హత్యచేసినట్టు తెలుస్తోంది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. దీంతో వెంకటసాయి దురాగతం వెలుగులోకి వచ్చింది. వెంటనే అతన్ని అరెస్టు చేసి విచారిస్తే అసలు గుట్టంతా చెప్పుకొచ్చాడు. 


తన సోదరి కుమార్తె మిస్సైందని ఫిర్యాదులో పేర్కొన్నప్పటికీ వెంకటసాయి కృష్ణ ఫ్యామిలీ మాత్రం ఆమెతో సంబంధం లేదని చెప్తున్నారు. అసలు ఆమెను  తమ ప్రాంతంలో చూడలేదంటున్నారు. ఎప్పుడూ అప్సరను ఇంటికి తీసుకొచ్చింది కూడా లేదని వివరిస్తున్నారు. 
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన కేసులో పోలీసులు అప్సర డెడ్‌బాడీని వెలికి తీసే పనిలో ఉన్నారు. నిందితులు వెంకటసాయికృష్ణ... మ్యాన్‌హోల్‌లో ఆమె డెడ్‌బాడీ వేయడమే కాకుండా దాన్ని కాంక్రీట్‌తో కప్పేశాడు. దాన్ని ఉప్పుడు జేసీపీ సాయంతో వెలికి తీస్తున్నారు.