Telangana RTC | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రోడ్డు ప్రయాణ సౌకర్యాలపై ఫోకస్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం కోసం తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ  కొత్త డిపో నిర్మాణం, బస్ స్టేషన్ అప్‌గ్రేడేషన్, పునరుద్ధరణ, బస్ స్టేషన్ల ఆధునీకరణ కోసం రూ.108.02 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు ఇచ్చింది. 

Continues below advertisement

పరిపాలన అనుమతులు ఇచ్చిన బస్టాండ్లు, డిపోలు ఇవే

1. మద్గుల్ బస్ స్టేషన్2. నాగర్ కర్నూల్ బస్ డిపో3. మహబూబ్ నగర్ బస్ స్టేషన్4. రెగొండ బస్ స్టేషన్5. వేములవాడ బస్ స్టేషన్6. గంగాధర బస్ స్టేషన్7. నిజామాబాద్ బస్ స్టేషన్8. ఘన్‌పూర్ బస్ స్టేషన్9. పాల్వంచ బస్ స్టేషన్10. మునుగోడు బస్ స్టేషన్11. చండూర్ బస్ స్టేషన్12. చౌటుప్పల్ బస్ స్టేషన్13. ఐజా బస్ స్టేషన్14. వనపర్తి బస్ స్టేషన్15. పెబ్బైర్ బస్ స్టేషన్16. కొల్లాపూర్ బస్ స్టేషన్17. పెంట్లవెల్లి బస్ స్టేషన్18. దమ్మపేట బస్ స్టేషన్19 మండలపల్లి బస్ స్టేషన్20. అశ్వరావుపేట బస్ డిపో21. హుస్నాబాద్ బస్ డిపో22. కథలాపూర్ బస్ స్టేషన్23. గోదావరిఖని బస్ స్టేషన్24. గూడూరు బస్ స్టేషన్25. మర్రిగూడ బస్ స్టేషన్26. నెక్కొండ బస్ స్టేషన్27. నర్సంపేట బస్ స్టేషన్28. వలిగొండ బస్ స్టేషన్29. నర్సంపేట బస్ స్టేషన్ (గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ షాపింగ్ కాంప్లెక్స్)30. నెక్కొండ బస్ స్టేషన్ (షాపింగ్ కాంప్లెక్స్)

Continues below advertisement

పైన పేర్కొన్న బస్ స్టేషన్ల మంజూరు దృష్ట్యా, ఆమోదం పొందిన పనుల అమలుకు అవసరమైన అన్ని చర్యలను ప్రారంభించాలని సివిల్ ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. గత 10 సంవత్సరాలు ఆర్టీసీ నిర్వీర్యం అయి  ఇబ్బందుల నుండి మహా లక్ష్మీ పథకం ద్వారా నూతన బస్సుల కొనుగోలు, కొత్త బస్సు డిపోల ఏర్పాటు, బస్ స్టేషన్ ల అభివృద్ధితో పాటు తమ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి సారించిందని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ ప్రయాణికుల భద్రత, ఉద్యోగుల సంక్షేమం అనే 3 విధానాలతో ఆర్టీసీ మరింత ముందుకు పోతుందన్నారు.