Revanth Reddy : తెలంగాణలో కులగణన విషయం హైకోర్టుకు చేరింది. కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ రిట్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. 


తెలంగాణలో బీసీసీ కుల గణన మూడు నెలల్లో చేపట్టాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఎర్ర సత్యనారాయణ రిట్ పిటిషన్ విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సత్యనారాయణ తరఫున నాగుల శ్రీనివాస్ యాదవ్ వాదనలు వినిపించారు. పిటిషనర్ తరఫున వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ప్రభుత్వానికి మూడు నెలల గడువు ఇచ్చింది. ఆ లోపు బీసీ గణన చేపట్టి నివేదిక సమర్పించాలని పేర్కొంది.