ఫాల్తు గాళ్లు ఫోన్లు చేసి బెదిరిస్తే మేం భయపడం. బోస్ రాజు గారు ఫోన్ చేశారని తెలిసింది. ఈ మీటింగ్ గురించి ఏ నిర్ణయమైనా వీహెచ్ తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో వీహెచ్ కే కాకుండా, సీనియర్లు ఎవరికి మర్యాద లభించడం లేదు. వర్కింగ్ కమిటీ, పీఏసీ కమిటీ, జూమ్ యాప్‌ తదితరాలు అన్ని నామమాత్రానికే ఉన్నాయి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి, ఠాకూర్ నిర్ణయాలు తీసుకొని మహేశ్ గౌడ్‌కు సమాచారం ఇస్తున్నారు. మహేశ్ గౌడ్ మాకు మెసేజ్‌లు పెడుతున్నారు. గతంలో పీఏసీ కమిటీ అంటే చాలా విలువైనదిగా ఉండేది. రేవంత్ రెడ్డి పీసీసీ కాకముందు వరకూ కూడా వర్కింగ్ కమిటీ కూడా చాలా వ్యాల్యూ ఉండేది. ఇప్పుడు అవేమీ లేవు. ఇప్పుడు ఠాకూర్, రేవంత్, మహేశ్ గౌడ్ ఇంతే నడుస్తున్నది.- జగ్గారెడ్డి