టీచర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు మరో అవకాశం
ఈ నెల 23న ముసాయిదా ఓటరు జాబితా
నవంబర్ 23 నుండి డిసెంబర్ 9 వరకు ఓటరు నమోదుకు అవకాశం


హైదరాబాద్:  హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ టీచర్ శాసన మండలి నియోజకవర్గంలో ఈ నెల (నవంబర్) 23వ తేదీ నుండి డిసెంబర్ 9 వరకు అర్హులైనవారు ఓటరు నమోదుకు భారత ఎన్నికల కమిషన్ మరో సారి అవకాశం కల్పించారు. ముసాయిదా ఓటరు జాబితా ఈ నెల 23వ తేదీన విడుదల చేస్తున్నారు. ముసాయిదా జాబితాలో తమ పేర్లను పరిశీలన చేసుకొని, జాబితాలో పేరు లేనివారు, అర్హత గలవారు ఇప్పటి వరకు ఓటరు నమోదు చేసుకోని యెడల తిరిగి నవంబర్ 23 నుండి డిసెంబర్ 9 వరకు మరోసారి ఓటరు నమోదుకు భారత ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించారు. ఇచ్చిన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.






రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్ లో టీచర్ గా  పనిచేస్తున్న వారు నవంబర్ 1, 2022  నాటికి  కనీసం 3 సంవత్సరాల అనుభవం కంటిన్యూగా (01-01-2016 నుండి 01-11- 2022  వరకు) 6 సంవత్సరాల సర్వీస్ కలిగి ఉండాలి. ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో ఎక్కడైనా పని చేసినప్పటికీ ఆ నియోజకవర్గంలో సాధారణ నివాసికి మాత్రమే ఓటరు జాబితాలో  చేర్చడానికి అర్హులు. ఓటరు నమోదులో ఏమైనా సందేహాలు ఉన్న పక్షంలో జిహెచ్ఎంసి టోల్ ఫ్రీ నెంబర్ 040- 21111111 ను సంప్రదించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ తెలిపారు.