Telangana latest News: ఫామ్‌హౌస్‌లో కోడి పందేలు, కేసినో నిర్వహించిన కేసు బీఆర్‌ఎస్‌ను వెంటాడుతోంది. సైలెంట్ అయిపోయిందని భావించిన ఈ కేసులో పోలీసులు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం విచారణకు రావాలని ఆదేశించారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడు చెప్పిన సంగతి తెలిసిందే. అయినా పోలీసులు మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు నోటీసులు జారీ చేశారు. 

ఫిబ్రవరి 11వ తేదీన హైదరాబాద్‌ నగర శివారులోని మొయినాబాద్‌ మండలం తొల్కట్టలోని ఓ ఫామ్‌హౌస్‌లో కోడి పందేలు నిర్వహించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఈఫామ్‌హౌస్‌లో సకల సౌకర్యాలతో కోడిపందేలు నిర్వహించారు.