గతంలో 10 ఏళ్లు వరుసగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసిందని, ఆ సమయంలో రైతులకు న్యాయం ఎందుకు చేయలేకపోయారని కాంగ్రెస్ నేతలను, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. అది రచ్చబండ కాదు లుచ్చా బండ అని.. రేవంత్ రెడ్డి చేపట్టిన రచ్చబండపై సంచలన ఆరోపణలు చేశారు. టీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు మీడియా సమావేశంలో స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. రేవంత్ ఓ దొంగ అని, దొంగ రెడ్డి అని.. రాహుల్ గాంధీ తోపా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. సీఎం కేసీఆర్ 14 యేండ్లు తెలంగాణ సాధన కోసం పోరాడారు, అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయంటే ఆయన పాలనే కారణం అన్నారు. దమ్ముంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో డిక్లరేషన్ అమలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు.


సీఎం కేసీఆర్‌పై రేవంత్ లాంటి వ్యక్తి విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. రేవంత్ ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ మటాష్ అని, పైసలు పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తి రేవంత్ అని ఆరోపించారు. తన విద్యా సంస్థలపై ఎన్నో ఆరోపణలు చేశారని, ఒక్కటీ నిరూపించలేకపోయారని పేర్కొన్నారు. టీడీపీలో ఉన్పప్పుడు తనను రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేశారని, కానీ ఏ విషయంలోనూ ఎదుర్కోలేకపోయారని చెప్పారు. 


రేవంత్ గుణమే అంత.. 
రేవంత్ రెడ్డి చేసేదంతా బ్లాక్ మెయిల్ రాజకీయాలని, అవసరమైతే రాహుల్ గాంధీని కూడా బ్లాక్ మెయిల్ చేస్తాడని సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు కు రేవంత్ పిర్యాదు చేస్తే తనకు ఎంపీ టికెట్ ఇచ్చారని చెప్పారు. రేవంత్ బిడ్డ పెళ్లికి పైసలు ఎవరు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా నేను తనకు డబ్బులు ఇవ్వలేదని రేవంత్ ప్రమాణం చేస్తారా అని అడిగారు. తాను పాలు పోసి కష్ట పడి సంపాదించానని.. కానీ రేవంత్ ఏం చేసి ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు.


కేసీఆర్ దేశ్ కా నేత.. మంత్రి మల్లారెడ్డి ప్రశంసలు
సీఎం కేసీఆర్ పాలనతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, టీఆర్ఎస్ అధినేత దేశ్ కా నేత అని మల్లా రెడ్డి ప్రశంసలు కురిపించారు. ‘కేసీఆర్ పంజాబ్ లో చెక్కులు పంచడం కాదు.. దేశమంతా చెక్కులు పంచుతాడు. కేసీఆర్ దేశాన్ని పాలించడం ఖాయం, తెలంగాణలో ఇస్తున్న పథకాలు దేశమంతా ఇస్తారు. కాంగ్రెస్ మొహాలకు ఎం చేయడం తెలుసు. బీజేపీ దేశాన్ని దివాళా తీయిస్తోంది. ప్రత్యామ్నాయం కేసీఆర్ ఎజెండా నే. హైద్రాబాద్ చూస్తే కేసీఆర్ గొప్పతనం తెలుస్తుంది. ఖబడ్ధార్ రేవంత్ రెడ్డి.. నోరు జాగ్రత్త. కేసీఆర్ అన్ని కులాలను బాగా చూసుకుంటున్నాడు.
రెడ్లకు కేసీఆర్ పెద్ద పీట వేయలేదా. నేను ఏ భూములు కొన్నా చట్టబద్ధంగా కొన్నా. తో మంది డాక్టర్లు ఇంజినీర్లను ఫార్మా సిస్టులను తయారు చేశా. నువ్వు మాత్రం రక్తం పీల్చే జలగవు. రేవంత్ ను జైలు కు పంపిస్తా. లీగల్‌గానే వెళ్తా. రేవంత్ పేదల పొట్ట గొడుతున్నారు’ అని మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు.