Hyderabad Crime News: పీఎస్ ఎదుటే నిప్పంటించుకుని డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వ్యక్తి ఆత్మహత్య

Advertisement
Shankar Dukanam   |  05 Nov 2025 10:02 AM (IST)

Drunk and Drive In Hyderabad | డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిన ఓ వ్యక్తి పీఎస్ ఎదుట నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ పీఎస్ ఎదుట ఈ ఘటన జరిగింది.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వ్యక్తి ఆత్మహత్య

సింగిరెడ్డి మీన్ రెడ్డి దమ్మాయిగూడ నివాసిగా పోలీసులు గుర్తించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అతనికి బ్రీత్ అనలైజర్‌లో 120 రీడింగ్ వచ్చినట్లు కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అయితే, పోలీసులు వ్యవహరించిన తీరుపై మనస్తాపం చెంది అతను ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.

Continues below advertisement

పోలీసులు మీన్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వ్యక్తి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Continues below advertisement
Published at: 05 Nov 2025 10:02 AM (IST)
Continues below advertisement
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.