Hyderabad Latest News: ఏప్రిల్ 17న హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధుల్లో వైన్ షాపులు మూతపడనున్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 17న మద్యం దుకాణాలు మూసి వేయాలని నగర పోలీస్ కమిషనర్ కే. శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 17న ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి వేయాలని స్పష్టం చేశారు. వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు 24 గంటలపాటు బంద్ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో శాంతి భద్రతల దృష్ట్యా వైన్ షాపులు మూసి వేయాలనే నిర్ణయం తీసుకున్నామని సీపీ అన్నారు.