హైదరాబాద్‌లోని కుషాయిగూడ ప్రాంతంలో ఆదివారం (ఏప్రిల్ 16) తెల్లవారుజామునే భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఒక టింబర్‌ డిపోలో మంటలు అంటుకుని నలుగురు సజీవ దహనం అయ్యారు. వీరిలో భార్యభర్తలు, వారి చిన్న కుమారుడు ఉన్నారు. మంటలు పక్కన ఉన్న ఇళ్లకు కూడా మంటలు వ్యాపించాయి. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. రోడ్లమీదకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. 


మృతులు వరంగల్‌ జిల్లా తుంగతుర్తికి చెందిన నరేష్‌ (35), సుమ (28), బాబు (5) తో పాటు మరో కార్మికుడిగా గుర్తించారు. గల్లంతు అయిన మరో చిన్నారి ఆచూకీ తెలియరాలేదు. ఈ ప్రమాదంలో నాలుగు షాపులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.