Mohammad Abdul Shoaib became the only Indian survivor of Saudi bus crash:  సౌదీ అరేబియాలో మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న ఉమ్రా యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ఘటనలో బస్సులో  45 మంది భారతీయుల్లో హైదరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల మొహమ్మద్ అబ్దుల్ షోయబ్ మాత్రమే ప్రాణాలు కాపాడుకున్నాడు. రాత్రి 1:30 గంటల సమయంలో మదీనా నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ప్రమాదంలో బస్సు మొత్తం మంటల్లో బుగ్గి అయింది. బాధితుల శవాలు కాలిపోయి గుర్తించలేని స్థితిలో ఉన్నాయి. డ్రైవర్ పక్కనే కూర్చొని ఉండటం వల్ల షోయబ్‌ గాయాలతో బయటపడినట్లుగా తెలుస్తోది.  ప్రస్తుతం సౌదీ జర్మన్ హాస్పిటల్ ICUలో చికిత్స పొందుతున్న అతని పరిస్థితి నిలకడగా ఉంది. 

Continues below advertisement

హైదరాబాద్‌కు చెందిన 50 మంది ఉమ్రా యాత్రికులు గ్రూప్‌గా సౌదీ అరేబియాకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 20 మంది మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నారు. మక్కాలో కొందరు మదీనాకు వేర్వేరు కార్లలో వెళ్లగా, మరొకరు మక్కాలోనే ఉండిపోయారు.  మిగిలిన 46 మంది బస్సులో మదీనాకు బయలుదేరారు. నవంబర్ 16 రాత్రి సమయంలో ఈ బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టి మంటల్లో చిక్కుకుంది. 

చనిపోయిన వారంతా హైదరాబాద్ నివాసులు.  24 ఏళ్ల మొహమ్మద్ అబ్దుల్ షోయబ్, హైదరాబాద్‌కు చెందిన యువకుడు, తొలిసారి ఉమ్రా యాత్రకు వచ్చాడు. బస్సులో డ్రైవర్ పక్కనే కూర్చొని ఉండటమే అతనికి జీవితాన్ని ప్రాణాలతో ఉండేలా చేసింది. ప్రమాద సమయంలో మంటలు త్వరగా వ్యాపించినా, డ్రైవర్ సీట్ సమీపంలో ఉండటంతో షోయబ్ త్వరగా బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు.  ప్రస్తుతం సౌదీ జర్మన్ హాస్పిటల్ ICUలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతని కుటుంబం హైదరాబాద్‌లో ఆందోళనలో ఉంది.   

Continues below advertisement

 రియాధ్ భారత రాయబారి కార్యాలయం, జెద్దా కాన్సులేట్ పూర్తి సహాయం అందిస్తోంది.  జెద్దా కాన్సులేట్‌లో 24x7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు, టోల్‌ఫ్రీ నంబర్ 8002440003 అందుబాటులో ఉంది.   చనిపోయినవారి శవాలు గుర్తింపు కోసం డీఎన్‌ఏ టెస్టులు జరుగుతున్నాయి. సౌదీలోనే అంత్యక్రియలు జరపాలని కుటుంబాలు కోరుతున్నాయి.                 

AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, MLA మొహమ్మద్ మజీద్ హుస్సేన్ బాధిత కుటుంబాలను సమావేశమై ధైర్యం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని సౌదీ పంపుతోంది. అలాగే ఆర్థిక సాయం ప్రకటించింది.  మృతుల బంధువులను సౌదీకి తీసుకెళ్లేదుకు ఏర్పాట్లు చేస్తున్నారు