హైదరాబాద్ కూకట్ పల్లిలోని భాగ్యనగర్ లో భారీ అగ్రిప్రమాదం జరిగింది. భాగ్యనగర్ కాలనీ  ప్రధాన రహదారిపై ఉన్న ఫర్నిచర్ దుకాణంలో ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయంతో పరుగులు తీశారు. మంటలను అదుపు చేసేందుకు నాలుగు ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. మూడు అంతస్తులో మంటలు ఎగసిపడుతున్నాయి. గాలి ఎక్కువగా ఉండటంతో పక్కనే ఉన్న మూడు దుకాణాలకు మంటలు వ్యాపించాయి. మంటలను అదుపు చేసేందుకు అదనపు ఫైరింజిన్లను రప్పిస్తున్నారు.