Hyderabad News: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలపై ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఈడీ ఇచ్చిన నోటీసులు మేరకు మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్‌కు వచ్చారు. 2020-2023 మధ్య కాలంలో అజారుద్దీన్ హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేశారు. ఆ టైంలోనే అక్రమాలకు పాల్పడినట్టు అభియోగాలు మోపింది. రూ.3.8 కోట్ల మేర నిధులను దుర్వినియగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆడిట్‌లో కూడా అక్రమాలకు పాల్పడినట్టు విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో అజారుద్దీన్ ముందస్తు బెయిల్‌పై ఉన్నారు.