Disa Encounter Case :   దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ ఎప్రిల్ 12 వ తేదికి వాయిదా వేసింది హైకోర్టు. అడ్వకేట్ జనరల్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది.   దిశ హత్య , ఆ తరువాత జరిగిన నిందితులు ఎన్ కౌంటర్ దేశ వ్యాప్తంతా సంచలనం సృష్టించింది.  అయితే నిందితుల ఎన్ కౌంటర్ పై ప్రజల  నుండి అంతలా వ్యతిరేకత రానప్పటికీ మానహక్కుల సంఘాలు భగ్గుమన్నాయి. డిసెంబర్ 19వ తేది 2019 లో దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసారు. సీన్ రీకనస్ట్రక్షన్ లో భాగంగా నిందితులను స్పాట్ కు తీసుకెళ్తే , పోలీసులపై రాళ్ల దాడి చేయడంతో ఎన్ కౌంటర్ చే ామంటూ పోలీసులు తరుపున వాదనలు వినిపిస్తుంటే, ఇదింతా ఫేక్ ఎన్ కౌంటర్ అంటూ సుప్రీం కోర్టు నియమంచిన జుడిషియల్ కమీషన్ సుప్రీకోర్టుకు సీల్డ్ కవర్ లో నివేదిక సమర్పించింది.       


ఈ మొత్తం వ్యవహారంపై విచారణ తెలంగాణా హైకోర్టులో జరపాలంటూ సుప్రీం ఆదేశించడంతో ఇప్పటికే దిశ ఎన్ కౌంటర్ లో బాధితుల తరుపున వాదనలు ముగిశాయి. తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు అనేక కీలక అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా దిశ ఎన్ కౌంటర్ వ్యవహారంపై ప్రభుత్వం తరుపు వాదనలను వినిపిస్తున్న అడ్వకేట్ జనరల్ తీరుపై తీవ్ర అంసతృప్తిని వక్తం చేసినట్లు సమాచారం.   మొత్తం ఐదు ఇంప్లీడ్ పిటీషన్లపై అంగీకరించిన  హైకోర్టు , అప్పటి షాద్ నగర్ సిఐ శ్రీధర్ తోపాటు పోలీస్ ఆఫీసర్స్ సంఘం , రిటైర్డ్ పొలీస్ ఆఫీసర్స్, దిశా కుంటుంబం తరుపు న్యాయవాదుల వాదనలు విన్నది .        


ఈ కేసులో షాద్ నగర్ సిఐ శ్రీధర్ తరుపున వాదించిన సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్ రఘురామ్, జుడీషియల్ కమీషన్ నివేదికను పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదన్నారు. మరోపు సిఐ శ్రీదర్ తరుపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ ఈ కేసులో రెండో ఎఫ్ ఐఆర్ అవసరం లేదన్నారు.క మీషన్ రిపోర్ట్ ను కేవలం ఒక్క ఆధారంగా చూడాలని,  రిపోర్ట్ లో ఉన్నది ఉన్నట్లు ఆర్డర్ ఇవ్వాలని  లేదన్నారు.  గతంలో ఎన్ కౌంటర్ వ్యవహారంపై సిట్ ఇచ్చిన నివేదిక పై సెషన్స్ కోర్టులో విచారణ జరపాలని కోరారు దిశ కుటుంబసభ్యుల తరుపు న్యాయవాది.


అయితే దిశ ఎన్‌ కౌంటర్ కేసుపై మరోసారి వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలంటూ కోర్టును కోరారు అడ్వకేట్ జనరల్. దీంతో అడ్డకేట్ జనరల్ తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.  తదుపరి విచారణకు సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్ తమ తరుపు వాదనకు వస్తారని కోర్టుకు తెలపారు. ఇలా పదేపదే వాయిదా కోరడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణా ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ గా ఉన్నప్పుడు సుప్రీం కోర్టు న్యాయవాదులపై ఎందుకు ఆధారపడుతున్నారని హైకోర్టు ప్రశ్నించింది. దిశ ఎన్ కౌంటర్ కేసులో తదుపరి విచారణ ఏప్రిల్ 12 వ తేదికి వాయిదా వేసింది.