Mlc Kavitha Eight Questions To Centeral Govt : కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి 8 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆమె ఎనిమిది ప్రశ్నలు సంధించారు. గత 8 సంవత్సరాల పరిపాలనలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధాని నరేంద్ర మోదీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎనిమిది ప్రశ్నలు సంధించారు. 


1. మహిళా శక్తికి సమాన ప్రాధాన్యత కల్పించి వారికి సాధికారత కల్పిస్తామన్నారు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు ఎక్కడ ఉంది?  


2. దేశ జీడీపీ పడిపోతున్నా, జీడీపీ : గ్యాస్- డీజిల్- పెట్రోల్ ధరలు అమాంతంగా మాత్రం పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఇవి ఎందుకు లేవు? అమితంగా పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎక్కడ పెట్టుబడిగా పెట్టారు? 


3. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ప్రభుత్వ పక్షపాతానికి ముగింపు ఎప్పుడు? తెలంగాణకు రావాల్సిన రూ.7000 కోట్ల పెండింగ్‌ నిధులను బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుంది?


4. దేశంలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరుకుంది. "మెహంగై ముక్త్ భారత్" అని ప్రకటించుకున్న బీజేపీ అసలు అలాంటి "అచ్ఛే దిన్" ఎప్పుడు తెస్తారు? 


5. లా అండ్ ఆర్డర్, వ్యవస్థలు విఫలమయ్యాయి. కృత్రిమ ప్రచారాలు లేని నిజమైన “అమృత్ కాల్” ఎప్పుడు వస్తుంది?


6. రైతులు దేశానికి గుండె చప్పుడు, కానీ ఈ రోజు తెలంగాణలోని వరి, పసుపు రైతులు తమ కష్టానికి కనీస గుర్తింపును కోరినందుకు బీజేపీ చేతిలో నష్టపోతున్నారు.


7. ప్రధాని మోదీ ప్రభుత్వం “న్యూ ఇండియా” వాస్తవికత ఏంటంటే, ఇక్కడ కోట్లాది మంది భారతీయులు తమకు కనీస ఆదాయం అందించే ఉపాధిని పొందడంలో కష్టపడుతున్నారు.


8. చివరగా, PM Cares నిధుల గురించి నిజమైన సమాచారం ప్రజలకు తెలియజేసే రోజు వస్తుందా?