Nikhat Zareen : బాక్సర్ నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో నిఖత్ గోల్డ్ సాధించింది. దీంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తంది. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీల్లో 50 కేజీల విభాగంలో నిఖత్ జరీన్  స్వర్ణ పతకం సాధించడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వియత్నాంకు చెందిన బాక్సర్ న్యూయెన్ పై 5-0 తేడాతో ఘన విజయం సాధించి, మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు మరోసారి గోల్డ్ మెడల్ సాధించి పెట్టిన నిఖత్ జరీన్ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ అని సీఎం కేసీఆర్ అన్నారు. తన వరుస విజయాలతో దేశ ఖ్యాతిని నిఖత్ జరీన్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు.  
ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీల్లో తన కెరీర్ లో ఇది రెండో బంగారు పతకం కావడం గొప్ప విషయమని సీఎం అన్నారు. క్రీడాభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమానికి, తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ దిశగా తమ కృషిని కొనసాగిస్తూనే ఉంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 






క్రీడాభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమానికి, తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు మరోసారి గోల్డ్ మెడల్ సాధించి పెట్టిన నిఖత్ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ అన్నారు. తన వరుస విజయాలతో దేశ ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు.  






తన పవర్‌ఫుల్‌ పంచ్‌లతో ప్రత్యర్థిని చిత్తు చేసి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన నిఖత్‌ జరీన్‌కు మంత్రి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. ఆమె సాధించిన విజయాలకు భారత్‌ గర్వపడుతోందని ఆయన ట్వీట్‌ చేశారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా నిఖత్‌ ఖరీన్ కు అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌ షిప్‌లో భారత జెండా మరోసారి రెపరెపలాడిందన్నారు. బంగారు పతకం సాధించి దేశాన్ని గర్వపడేలా చేసిన నిఖత్‌ జరీన్‌కు కంగ్రాట్స్ అని కవిత తెలిపారు. 


పవర్ పంచ్ లతో ప్రత్యర్థిని మట్టికరిపించిన నిఖత్‌ జరీన్‌కు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు గోల్డ్ మెడల్ తో పాటు ప్రైజ్‌ మనీని అందజేశారు. అలాగే బాక్సింగ్ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ అజయ్‌ సింగ్‌ నిఖత్‌ జరీన్ ను  వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌ బెల్ట్‌తో సత్కరించారు.  






 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుతమైన విజయం సాధించి స్వర్ణం గెలుచుకున్నందుకు నిఖత్ జరీన్ కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.  ఆమె ఒక అత్యుత్తమ ఛాంపియన్ అని కొనియాడారు. ఈ విజయం భారతదేశాన్ని గర్వించేలా చేసిందన్నారు.