Breaking News: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు.. ఎవరెవరు లిస్టులో ఉన్నారంటే..!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఆగస్టు 25న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 25 Aug 2021 08:17 PM

Background

తెలంగాణలో బుధవారం తెల్లవారుజామునే ఓ రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో కాకినాడ వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలోని ఆకుపాముల వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు...More

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు.. ఎవరెవరు లిస్టులో ఉన్నారంటే..!

మాదక ద్రవ్యాల కేసులో టాలీవుడ్ సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రాణా దగ్గుపాటి, రవితేజ, పూరి జగన్నాథ్, నవదీప్, ముమైత్ ఖాన్, తరుణ్, నందుకు ఈడీ సమన్లు జారీ చేసిందని సమాచారం. డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలని సినీ ప్రముఖులను ఆదేశించింది. ఈనెల 31 నుంచి సెప్టెంబరు 22 వరకు సినీ ప్రముఖులను ఈడీ ప్రశ్నించనుంది. ఎక్సైజ్ శాఖ 2017లో నమోదు చేసిన కేసుల ఆధారంగా దర్యాప్తు జరగనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.