Huzurabad, Badvel Bypoll Results Live: ముగిసిన హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రక్రియ
హుజూరాబాద్, బద్వేల్ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు లైవ్ అప్ డేట్స్ ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ABP DesamLast Updated: 02 Nov 2021 06:20 PM

Background
తెలంగాణ రాజకీయాల్లో కొద్ది నెలలుగా నెలకొన్న తీవ్రమైన ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. నువ్వా నేనా అంటూ సాగిన సమరంలో విజేత ఎవరనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. హుజూరాబాద్, ఏపీలోని బద్వేల్లో రెండ్రోజుల క్రితం జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి ఉదయం 8...More
తెలంగాణ రాజకీయాల్లో కొద్ది నెలలుగా నెలకొన్న తీవ్రమైన ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. నువ్వా నేనా అంటూ సాగిన సమరంలో విజేత ఎవరనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. హుజూరాబాద్, ఏపీలోని బద్వేల్లో రెండ్రోజుల క్రితం జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకోసం కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కాలేజీలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు వీలుగా చర్యలు చేపట్టారు. కళాశాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర బలగాలు, కౌంటింగ్ సెంటర్ లోపల ఆర్మ్డ్ ఫోర్స్ (ఏఆర్) సిబ్బంది, వెలుపల సివిల్ పోలీసులతో మొత్తానికి మూడంచెల భద్రత ఏర్పాటు కట్టుదిట్టం చేశారు.కౌంటింగ్ పురస్కరించుకుని కాలేజీ పరిసరాల్లో మంగళవారం 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. టీఆర్ఎస్ తరఫున గెల్లు శ్రీనివాస్, బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్, కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన బల్మూరి వెంకట్తో పాటు మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.Also Read: Gold-Silver Price: ఇవాళే ధనత్రయోదశి.. బంగారం ధరలో కాస్త ఊరట.. తగ్గిన వెండి, నేటి ధరలివీ..తొలి ఫలితం ఉదయం 9.30 కే..ఎన్నికల లెక్కింపులో భాగంగా తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కించనున్నారు. ఆ తర్వాత తొలి ఈవీఎంను ఉదయం 8.30 గంటలకు లెక్కింపు ప్రారంభిస్తారు. తొలుత హుజూరాబాద్ మండలానికి చెందిన పోతిరెడ్డిపేట్ గ్రామంలోని పోలింగ్ కేంద్రంతో లెక్కింపు మొదలవుతుంది. చివరిగా కమలాపూర్ మండలంలోని శంభునిపల్లి బూత్కి చెందిన ఈవీఎంను తెరుస్తారు.ఏర్పాట్లు ఇవీ..ప్రభుత్వ కాలేజీలో రెండు విశాలమైన హాళ్లలో 306 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన 306 ఈవీఎంలలో ఓట్లను లెక్కిస్తారు. 14 టేబుళ్లపై మొత్తం 22 రౌండ్లుగా ఈ ప్రక్రియ కొనసాగనుంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భౌతికదూరం పాటించేలా టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో రౌండ్కు సగటున అరగంట సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. పోలైన ఓట్లు 2 లక్షలు దాటడంతో ఫలితం అధికారికంగా వెలువడే సరికి సాయంత్రం అవుతుందని అంచనా వేస్తున్నారు.Also Read: Dhanteras 2021: ఈ దంతేరాస్కి గోల్డ్ కాయిన్ రూ.1 కే కొనొచ్చు.. ఎలాగో తెలుసా, చాలా సింపుల్ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
ముగిసిన హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రక్రియ
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రక్రియ ముగిసింది. కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ ను ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ అభినందించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రక్రియ సజావుగా పూర్తి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. బీజేపీకి మొత్తం 107022 ఓట్లు, టీఆర్ఎస్ 83167 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై 23,855 మెజార్టీతో గెలుపొందారు.