By Election Live Updates: ముగిసిన బద్వేల్, హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్

నేడే హుజూరాబాద్​, బద్వేలు ఉపఎన్నికల పోలింగ్.. ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది.

ABP DesamLast Updated: 30 Oct 2021 07:09 PM

Background

హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. చివరి గంటను కొవిడ్‌తో బాధపడుతున్న వారు పీపీఈ కిట్లతో వచ్చి ఓటు వేసేందుకు కేటాయించారు. 2018లో 84.5...More

గంట పాటు జమ్మికుంటలో నిలిచిపోయిన ఈవీఎంల బస్సులు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట నుంచి ఈవీఎంలతో కరీంనగర్ బయలుదేరిన బస్సులు జమ్మికుంట సమీపంలో  గంట సేపటి నుంచి నిలిచిపోయాయి. ఈ బస్సుల్లో ఒకదానికి పంక్చర్ కావడంతో టైర్ మార్చడం కోసం ఆపినట్లు అధికారులు చెబుతున్నారు.