= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
గంట పాటు జమ్మికుంటలో నిలిచిపోయిన ఈవీఎంల బస్సులు కరీంనగర్ జిల్లా జమ్మికుంట నుంచి ఈవీఎంలతో కరీంనగర్ బయలుదేరిన బస్సులు జమ్మికుంట సమీపంలో గంట సేపటి నుంచి నిలిచిపోయాయి. ఈ బస్సుల్లో ఒకదానికి పంక్చర్ కావడంతో టైర్ మార్చడం కోసం ఆపినట్లు అధికారులు చెబుతున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
హుజూరాబాద్ ఉపఎన్నికలో 86.33 శాతం, బద్వేల్ లో 68.12 పోలింగ్ శాతం నమోదు హుజూరాబాద్ ఉపఎన్నికలో రాత్రి 7 గంటలకు 86.33 శాతం పోలింగ్ నమోదైంది. బద్వేల్ లో 68.12 పోలింగ్ శాతం నమోదు అయ్యింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ముగిసిన బద్వేల్, హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ బద్వేల్, హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు హుజూరాబాద్ లో 79.05 శాతం, బద్వేల్ లో 59.58 శాతం పోలింగ్ నమోదైంది. చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉన్న EVMలను పటిష్ట భద్రత మధ్య కరీంనగర్ కు తరలించనున్నారు. పట్టణంలోని SRR కళాశాలలో ఈవీఎంలను భద్రపరచనున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
బద్వేల్ ఉపఎన్నికలో సాయంత్రం 5 గంటలకు 59.58 శాతం పోలింగ్ బద్వేల్ ఉపఎన్నికలో సాయంత్రం 5 గంటలకు 59.58 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
జమ్మికుంటలో తీవ్ర ఉద్రిక్తత ... ఎమ్మెల్యే పీఏలపై స్థానికుడు దాడి కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలతో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పీఏలను స్థానికులు అడ్డుకున్నారు. వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
హుజూరాబాద్ లో సాయంత్రం 5 గంటల వరకు 76.26 పోలింగ్ శాతం నమోదు హుజూరాబాద్ లో ఐదు గంటల వరకు 76.26 పోలింగ్ శాతం నమోదైంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
మధ్యాహ్నం 3 గంటల వరకు హుజూరాబాద్ లో 61.66 శాతం, బద్వేలులో 44.82శాతం పోలింగ్ నమోదు హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 61.66 శాతం పోలింగ్ నమోదైంది. బద్వేలు ఉపఎన్నికల్లో పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు 44.82శాతం పోలింగ్ నమోదైంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఈటల రాజేందర్ కాన్వాయ్ లోని మూడు వాహనాలు సీజ్ కమలాపూర్ మండలం మరిపెల్లి గూడెంలో ఈటల రాజేందర్ కాన్వాయ్ లోని మూడు వాహనాలు సీజ్ చేశారు పోలీసులు. అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ పీఆర్వో ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
హుజూరాబాద్ పట్టణంలో డబ్బు పంచుతున్న వ్యక్తి.. పోలీసులకు అప్పగింత హుజూరాబాద్ పట్టణంలో డబ్బు పంచుతున్న ఓ వ్యక్తిని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. హనుమాన్ ఆలయం వద్ద డబ్బు పంచుతున్న సమాచారం అందుకున్న బీజేపీ శ్రేణులు అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించాయి. ఆ వ్యక్తి నాన్ లోకల్ అని.. హుజూరాబాద్ కు వచ్చి.. డబ్బులు పంచుతున్నాడని బీజేపీ కార్యకర్తలు చెబుతున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఓటేసిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఓటేసేందుకు ప్రజలు తరలిరావాలని హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కోరారు. పోలింగ్ శాతం బాగా పెరగాలన్నారు. ఆయన స్వగ్రామం ఇన్మంత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
బద్వేలులో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 35.47 శాతం పోలింగ్ కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 35.47 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాత్రి 7 వరకు పోలింగ్ కొనసాగనుంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
హుజూరాబాద్ లో ఉపఎన్నిక పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎంతంటే హుజూరాబాద్ లో ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 45.63 శాతం పోలింగ్ నమోదైంది. రాత్రి 7 గంటల వరకు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
హుజూరాబాద్లో సీఈవో శశాంక్ గోయల్ పర్యటన హుజూరాబాద్లో చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ పర్యటిస్తున్నారు. హుజూరాబాద్లో పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలిసిన ఎంపీ జీవీఎల్ కేంద్ర ఎన్నికల కమిషనర్ను ఎంపీ జీవీఎల్ కలిశారు. బద్వేలు ఉపఎన్నికలో అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. బయటి వ్యక్తులు వస్తున్నారని సీఈసీకి ఫిర్యాదు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది: విజయానంద్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్... బద్వేల్ ఉప ఎన్నికను వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. 281 పోలింగ్ కేంద్రాల్లోనూ ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటివరకు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని పేర్కొన్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
బీజేపీ అభ్యర్థి ఈటలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు పోలింగ్ తేదీన ప్రెస్ మీట్ నిర్వహించారని హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ భరత్ కుమార్ ఫిర్యాదు చేశారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
చల్లూరులో బీజేపీ శ్రేణుల ఆందోళన హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం చల్లూరులో బీజేపీ శ్రేణులు ఆందోళన చేశాయి. మార్కెట్ ఛైర్మన్ బాలకిషన్రావు ఇంట్లో డబ్బులు పంచుతున్నారని ధర్నా చేశారు. చల్లూరులో బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఎస్.వెంకటాపురం పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన బీజేపీ, వైసీపీ అభ్యర్థులు బద్వేలు నియోజకవర్గంలోని ఎస్.వెంకటాపురం కేంద్రాన్ని బీజేపీ, వైసీపీ అభ్యర్థులు పరిశీలించారు. బద్వేలు ఉపఎన్నికలో వైసీపీ నాయకులు దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు. అట్లూరు, ఎస్.వెంకటాపురానికి బయటి వ్యక్తులు వచ్చారని చెప్పారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని వైసీపీ అభ్యర్థి సుధ అన్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఉదయం 11 గంటల వరకు 20.89 శాతం పోలింగ్ నమోదు బద్వేలు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11గంటల వరకు 20.89 శాతం పోలింగ్ నమోదైంది. రాత్రి 7 వరకు పోలింగ్ జరగనుంది. బద్వేలు ఉప ఎన్నికను వెబ్కాస్టింగ్ ద్వారా రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి విజయానంద్ పర్యవేక్షిస్తున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
హుజూరాబాద్ లో 11 గంటల వరకు ఎంత పోలింగ్ నమోదు అయిందంటే.. హుజూరాబాద్ లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 33.27 శాతం పోలింగ్ నమోదైంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
హుజూరాబాద్ లో ఉదయం 9 గంటల వరకు 10.50 శాతం పోలింగ్
హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 10.50 శాతం పోలింగ్ నమోదైంది. రాత్రి 7 గంటల వరకు ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. బుద్ధభవన్ నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్ సరళిని సీఈవో శశాంక్ గోయల్ పరిశీలిస్తున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
బద్వేలులో ఉదయం 9 గంటల వరకు 10.49 శాతం పోలింగ్ బద్వేలు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 వరకు 10.49 శాతం పోలింగ్ నమోదైంది. రాత్రి 7 వరకు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కమలాపూర్ లో ఓటేసిన ఈటల రాజేందర్ కమలాపూర్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన సతిమణితోపాటు జమున కూడా ఓటు వేశారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కొనసాగుతున్న హుజూరాబాద్, బద్వేలులో ఉపఎన్నికల పోలింగ్ హుజూరాబాద్, బద్వేలులో ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కందుగులలో పోలింగ్ కేంద్రాన్ని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పరిశీలించారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. బద్వేలులో ఉపఎన్నిక పొలింగ్ కొనసాగుతోంది. 281 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కందుగుల గ్రామంలో ఈటల రాజేందర్ హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పోలింగ్ బూత్ను సందర్శించారు. అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు అందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
తొలిగంటలో హుజూరాబాద్ 7.5 శాతం, బద్వేలు 9.5 శాతం పోలింగ్ నమోదు హుజూరాబాద్, బద్వేలు ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలతోపాటు మరికొంతమంది అభ్యర్తులుగా పోటీలో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది స్వతంత్ర అభ్యర్థుగా బరిలో నిలిచారు. హుజూరాబాద్ 30 మంది, బద్వేలులో 15 మంది పోటీ చేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ కేంద్రంలో రెండు ఈవీఎంలను ఏర్పాటు చేశారు. మెుదటి దానిలో 16 మంది, రెండో దానిలో 14 మంది అభ్యర్థులతోపాటు చివరన నోటా గుర్తు ఉంటుంది. బద్వేలులోని పోలింగ్ కేంద్రాల్లో ఒకే ఈవీఎంను ఏర్పాటు చేశారు. బద్వేలులో తొలిగంటలో 9.5 శాతం పోలింగ్ నమోదైంది. హుజూరాబాద్ లో 7.5 శాతం పోలింగ్ నమోదైంది
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
హుజూరాబాద్ లో కొనసాగుతున్న ఉపఎన్నిక పోలింగ్ హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధాన పార్టీలైన భాజపా అభ్యర్థిగా ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్. కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూర్ వెంకట్ ఉన్నారు. కమలాపూర్ లో ఈటల రాజేందర్ ఓటు వేయనున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
హుజూరాబాద్ వార్.. ఇల్లంతకుంటలో ఇంకా ప్రారంభం కానీ పోలింగ్.. మెురాయిస్తున్న ఈవీఎంలు హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంటలో పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఇక్కడ ఈవీఎంలు మెురాయిస్తున్నట్టు తెలుస్తోంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభం హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. హుజూరాబాద్లో మెుత్తం 2,37,022 మంది ఓటర్లు ఉన్నారు. హుజూరాబాద్లో పురుష ఓటర్లు 1,18,720 మంది, మహిళా ఓటర్లు 1,17,563 మంది ఉన్నారు. ఉపఎన్నిక బరిలో మెుత్తం 30 మంది అభ్యర్థులు ఉన్నారు.