కన్నీళ్లు పెడుతుంటే.. నిమ్మకు నీరెత్తినట్టుగా కేసీఆర్‌ ప్రభుత్వం బాధ్యతను విస్మరిస్తోందని ఈటల రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అనాలోచిత విధానాల వల్లే రాష్ట్రం అస్తవ్యస్తమైందన్నారు. హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. 40 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఈటల అన్నారు. కొనుగోలులో జాప్యం వల్ల ధాన్యం రంగు మారుతోందన్నారు.  వర్షాలకు తడిసి మొలక వస్తోందని చెప్పారు. రైతుల పరిస్థితికి పూర్తి బాధ్యత కేసీఆర్‌దేనని ఈటల అన్నారు. 


అన్నీ నాకే తెలుసు.. అన్నీ చేయగలననే అహంకార ధోరణితో సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని ఈటల విమర్శించారు. కేసీఆర్‌ నిర్వాకం వల్ల తెలంగాణ రైతులు.. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కేసీఆరే పూర్తి బాధ్యత వహించాలని ఈటల స్పష్టం చేశారు. ఒకప్పుడు విపక్షాలతో చర్చించి సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాలు ఉండేవని.. రాష్ట్రంలో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ఈ దేశంలో ఏరాష్ట్రం కూడా కొనలేని వరి ధన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిందని అసెంబ్లీలో సీఎం గొప్పలు చెప్పారన్న ఈటల..  ఆ సమయంలో కేంద్రమే ధాన్యం కొనుగోలు చేస్తుందని, సహకరిస్తుందని అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.


ఈ వడ్లు కొంటున్నది కేసీఆర్‌ కాదని,  ధాన్యం, గన్నీ బ్యాగ్‌లు, హమాలీ ఛార్జీలు, ఐకేపీ కేంద్రాల కమీషన్‌, రైసు మిల్లుల ఛార్జీలు, రవాణా ఛార్జీలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అని స్పష్టమైంది. కేసీఆర్‌ తన కీర్తి కోసం తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదు. ఒకసారి వరి వేయొద్దన్నారు, ఒకసారి పత్తి వేయొద్దన్నారు, ఒకసారి సన్న వడ్లు వేయొద్దన్నారు. ఇష్టమొచ్చినట్టు కేసీఆర్‌ చెబుతున్నారు. బాయిల్డ్‌ రైస్‌ కొనటాన్ని కేంద్రం ఎప్పుడైనా నిలిపివేస్తుందని గతంలో మిల్లర్లు  ముఖ్యమంత్రికి చెప్పారు. రైతు సంఘాలు, మిల్లర్ల సూచనలు కేసీఆర్‌ పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాన్ని కేంద్రంపై రుద్దుతున్నారు. కేసీఆర్‌ రైతు బంధు కాదు.. రైతు ద్వేషి. ఒక్క రైతు బంధు ఇచ్చి.. మిగతా ప్రయోజనాలన్నీ ఆపేశారు. హుజూరాబాద్‌ ఎన్నిక కోసం రూ.వేల కోట్లు ఖర్చు పెట్టలేదా? రైతుల కోసం ఆ మాత్రం చేయలేరా? హుజూరాబాద్‌ ఫలితం నుంచి ప్రజల దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తున్నారు.
                                                                                 - ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే


Also Read: TS Politics : కేంద్రం చెప్పేసింది ! ఇక రాజకీయాలు పక్కన పెట్టి రైతుల గురించి ఆలోచిస్తారా ?


Also Read: Congress: అసెంబ్లీ రౌడీ సినిమా తరహాలో బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలు.... ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టైనా ప్రతీ గింజ కొనిపిస్తాం... రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు