ED raids a prominent contracting firm in Hyderabad:  హైదరాబాద్‌లో ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కంపెనీ ఆఫీసుల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. SEW ఇస్రా స్ట్రక్చర్ కంపెనీ కు చెందిన డైరెక్టర్ల నివాసాలపై ఈడీ సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బ్యాంకు లోన్ వ్యవహారంలో గతంలో సంస్థపై సిబిఐ కేస్ నమోదు అయింది.  ఉత్తరప్రదేశ్ లో ప్రాజెక్టు నిర్మాణానికి 14 బ్యాంకుల నుండి 1700 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న కంపనీ.. ప్రాజెక్టు పూర్తి చేయకుండానే సబ్ కాంట్రాక్టుల పేరుతో నిధులను మళ్లించినట్లుగా గుర్తించారు. 621 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టినట్లుగా ఫిర్యాదులు ఉన్నాయి. 

హైదరాబాదులో మొత్తం ఆరు చోట్ల ఈ డి సోదాలు నిర్వహించి.. కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. 120 కోట్ల విలువచేసే పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. Sew కు ప్రమోటర్లుగా ఉన్న వారితోపాటు కుటుంబ సభ్యుల నివాసాల్లోనూ సోదాలు చేసి.. సంస్థకు చెందిన 33 బ్యాంక్ అకౌంట్ లను ఫ్రీజ్ చేసినట్లుగా చెబుతున్నారు.

 SEW LSY హైవేస్ లిమిటెడ్, డైరెక్టర్లు సుంకర అనిల్ కుమార్, యర్లగడ్డ వెంకటేశ్వర రావు,   పుదిపెద్ద సత్యమూర్తి ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు.  CBI గతంలో 2020లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో, SEW LSY హైవేస్ లిమిటెడ్ రూ. 300 కోట్ల టర్మ్ లోన్‌ను పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) నుంచి పొంది, రూ. 108 కోట్లను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు చేసింది. ఈ రుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర హైవే అథారిటీ ప్రాజెక్టు కోసం సాంక్షన్ చేశారు. కానీ కంపెనీ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయలేకపోయింది   SEW LSY హైవేస్ లిమిటెడ్, PNB నేతృత్వంలోని 14 బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ. 1700 కోట్ల రుణం,  రూ. 300 కోట్ల ఫైనాన్షియల్ క్రెడిట్ లిమిట్‌ను పొందింది. ఈ కన్సార్టియంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, డెనా బ్యాంక్, ICICI బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఇప్పుడు SBI), స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఇప్పుడు SBI), స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా (ఇప్పుడు SBI), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,   విజయా బ్యాంక్ (ఇప్పుడు BoB) ఉన్నాయని సీబీఐ చెప్పింది. 

CBI దర్యాప్తులో, కంపెనీ ఈ రుణాలను గ్రూప్ కంపెనీ SEW ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్‌కు బదిలీ చేసి దుర్వినియోగం చేసినట్లు తేలింది, ఇది అక్రమమైనదని ఫోరెన్సిక్ ఆడిట్‌లో గుర్తించారు. రుణ నిధులు ప్రాజెక్టు కోసం ఉపయోగించబడకుండా, గ్రూప్ ఎంటిటీ అకౌంట్స్‌కు డైవర్ట్ చేశారు.  కంపెనీ ప్రాజెక్టు షెడ్యూల్‌ను పాటించలేకపోయింది, దీని వల్ల రుణాలు నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్ (NPAs)గా మారాయి, బ్యాంకులకు గణనీయమైన నష్టం వాటిల్లింది. ఈ సోదాల సమయంలో, ED ఇంక్రిమినేటింగ్ డాక్యుమెంట్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ రికార్డులు,   డిజిటల్ ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఈ ఆధారాలు కంపెనీ రుణ నిధులను దుర్వినియోగం చేసి, షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేసినట్లు తేలిందని చెబుతున్నారు.