Dalit Dandora Yatra Live Updates: ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ ‘దళిత దండోరా’.. కదం తొక్కిన నేతలు
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దళిత దండోరా యాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది.
ABP Desam Last Updated: 09 Aug 2021 06:46 PM
Background
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 9న దళిత దండోరాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో ఉద్యమాలకు వేదికగా నిలిచిన ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి నుంచి దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాను మోగించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు....More
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 9న దళిత దండోరాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో ఉద్యమాలకు వేదికగా నిలిచిన ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి నుంచి దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాను మోగించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. సోమవారం ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితం నుంచే కాంగ్రెస్ నేతలు ఆదిలాబాద్ జిల్లాలో మకాం వేశారు. దళిత బంధు తెలంగాణ మొత్తం అమలు చేయాలనే డిమాండ్తో పాటు గిరిజనుల పోడు భూముల వ్యవహారంపై కూడా కాంగ్రెస్ నేతలు గళమెత్తనున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు : రేవంత్ రెడ్డి
సీఎం కేసీఆర్ పాలనలో ఎస్సీలు, ఎస్టీల జీవితాలు చితికిపోయాయని, ఆదివాసీల జీవితాలు మార్చాలనేదే కాంగ్రెస్ ప్రణాళిక అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలిపారు. ఎన్నికల కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు తెచ్చిందని రేవంత్ అన్నారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్కు ఎస్సీలు గుర్తుకు వస్తారన్న ఆయన...దళితబంధును తెలంగాణ మొత్తం ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి దళిత, గిరిజన దండోరా సభలో అన్నారు.