హైదరాబాద్: తెలంగాణలోని ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం చొప్పున డీఏ పెంచుతూ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా పెంచిన డీఏ(Dearness Allowance) 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుంది. ఇదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉద్యోగుల డీఏ 26.39 శాతం నుంచి 30.03 శాతానికి పెరిగింది.