Attack on BRS Leaders Convoy in Nalgonda: మాజీ మంత్రులు హరీష్ రావు (Harishrao), కేటీఆర్ (KTR), బీఆర్ఎస్ నేతలకు నిరసన సెగ తగిలింది. నల్గొండలో బహిరంగ సభకు వెళ్తున్న నేపథ్యంలో.. వీటి కాలనీ వద్ద వీరి కాన్వాయ్ ను NSUI కార్యకర్తలు అడ్డుకుని.. వారి వాహనంపై కోడిగుడ్లు విసిరారు. నల్ల చొక్కాలు ధరించి.. 'కేటీఆర్ గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అక్కడ పరిస్థితిని చక్కదిద్దారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అటు, నల్గొండ సభకు బీఆర్ఎస్ నేతలు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు.


Also Read: CM Revanth Reddy: మేడిగడ్డకు చేరుకున్న సీఎం రేవంత్ బృందం - కుంగిన పిల్లర్లు పరిశీలించిన ప్రజా ప్రతినిధులు