Breaking News: నక్కలవాగులో విద్యార్థి గల్లంతు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 07 Dec 2021 08:05 PM

Background

వాయువ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం కొనసాగుతోంది. జవాద్ తుపాను ఒడిశాలోని పూరీకి సమీపంలో బలహీనపడి తీరాన్ని దాటింది. అయితే పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి బలహీన పడుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర మట్టానికి...More

నక్కలవాగులో విద్యార్థి గల్లంతు

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని నక్కలవాగు దాటుతూ 6వ తరగతి విద్యార్థి గల్లంతయ్యాడు. స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విద్యా్ర్థి వెంకటాపురానికి గ్రామానికి చెందినవాడని తోటి విద్యార్థులు అంటున్నారు. విషయం తెలిసిన విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనల చెందుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే వాగులో 20 రోజుల ఒకరు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.