AP Telangana Breaking News: నేతల ఆడియో టేపులపై విచారణ అవసరం : వాసిరెడ్డి పద్మ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
Background
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలకు రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రక్షా బంధన్ అనేది అన్నాచెల్లె్ళ్లు లేదా అక్కా తమ్ముళ్ల బంధానికి చిహ్నమని, ఇది ఒక గొప్ప భారతీయ సాంప్రదాయమని...More
నేతల ఆడియో టేపులపై విచారణ అవసరమని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ‘‘ఆ మాటలు తమవి కావని నేతలు అంటున్నారు. నేతల వ్యవహారంపై విచారణ జరగాల్సిన అవసరం ఉంది. నేతల ఆడియో టేపుల ఘటనపై విచారణ కోరతాం. మహిళా కమిషన్ తరఫున సమాచారం తెప్పించుకుంటాం. అసభ్యకర ప్రవర్తనపై మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోదు. రమ్య ఘటనపై టీడీపీ 21 రోజుల డెడ్లైన్ సరికాదు. నిందితులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’’ అని వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఇటీవల పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, మరో నేత అంబటి రాంబాబులకు సంబంధించిన ఆడియో టేపు లీకవడం కలకలం రేపిన విషయం తెలిసిందే.