Breaking News Telugu Live Updates: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఇంజినీరింగ్ శాఖలో పోస్టుల భర్తీకి ఆదేశాలు
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్డేట్స్, వివరాలు మీకోసం
ABP Desam Last Updated: 02 Jul 2022 03:53 PM
Background
ఎప్పుడైతే బీజేపీ తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలిచిందో ఇక అప్పటి నుంచి మాంచి రాష్ట్రంలో పార్టీ ఫామ్లోకి వచ్చింది. దీనికి తోడు రాష్ట్రానికి చెందిన బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి వంటి వారికి ఉన్నత పదవులు కట్టబెట్టడంతో...More
ఎప్పుడైతే బీజేపీ తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలిచిందో ఇక అప్పటి నుంచి మాంచి రాష్ట్రంలో పార్టీ ఫామ్లోకి వచ్చింది. దీనికి తోడు రాష్ట్రానికి చెందిన బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి వంటి వారికి ఉన్నత పదవులు కట్టబెట్టడంతో తెలంగాణపై పట్టుసాధించే ప్రయత్నం చేసింది బీజేపీ అధిష్టానం. ఈ ఊపులో మరింతగా పనిచేసిన బీజేపీ శ్రేణులకు దుబ్బాక బైపోల్ ధీమానిచ్చింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు గెలుపు పార్టీలో జోష్ నింపింది. ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికారపార్టీకి గట్టి పోటీనివ్వడంతో ఇక కమలానికి కొండంత బలం పెరిగినట్టైంది. ఇది చాలదన్నట్లు సీఎం కీసీఆర్కు దూరమై పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఈటల రాజేందర్ గెలుపు కూడా బీజేపీకి కలిసొచ్చింది. తెలంగాణ డిక్లరేషన్, టార్గెట్ సీఎం కేసీఆర్గా బీజేపీ తమ ప్లీనరీని హైదరాబాద్లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.నైరుతి రుతుపవనాల తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో విస్తరించడంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో శుక్రవారం తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. జూలై 4 నాటికి ఉత్తర ఒడిశా దాని పరసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. ఏపీలోని కోస్తాంధ్రలో నేటి నుంచి మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలోని ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుల సూచన, వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర భారత దేశద్వీపకల్పం 19 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి గాలుల సముద్ర మట్టానికి 3.1 నుంచి 7.6 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగి బలహీన పడింది. తూర్పు పడమర ద్రోణి ఇప్పుడు పంజాబ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు దక్షిణ ఒడిశా తీరం నుంచి హరియాణా, దక్షిణ ఉత్తర ప్రదేశ్, ఈశాన్య మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం మధ్య తీర ప్రాంత ఒడిశా, పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తులో దక్షిణం వైపు వంగి ఉంటుంది. బులియన్ మార్కెట్లో వరుసగా రెండో రోజులు పుంజుకున్న బంగారం ధరలు నేడు దిగొచ్చాయి. మరోవైపు వెండి ధర వరుసగా నాలుగో రోజు పతనమైంది. వెండిపై రూ.200 తగ్గడంతో 1 కేజీ ధర రూ.65,000కి పతనమైంది. రూ.1,300 పెరగడంతో తాజాగా హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,200కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,850 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు నేడు హైదరాబాద్లో 1 కేజీ వెండి ధర రూ.65,100 అయింది. కరీంనగర్, వరంగల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,200, 22 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.47,850 అయింది. నేడు ఏపీలో బంగారం ధర.. ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరగడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,200 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,850 గా ఉంది. విజయవాడలో స్వచ్ఛమైన వెండిపై రూ.200 తగ్గడంతో 1 కేజీ ధర రూ.65,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర (Petrol Price Today 2nd July 2022) రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద పాత ధరలకే విక్రయిస్తున్నారు. తెలంగాణలో ఇంధన ధరలు..నేడు వరంగల్లో పెట్రోల్ ధర నిలకడగా ఉంది. నేడు పెట్రోల్ లీటర్ ధర రూ.109.16 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.35 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ పై 18 పైసలు తగ్గి పెట్రోల్ లీటర్ ధర రూ.109.38 కాగా, 16 పైసలు తగ్గడంతో డీజిల్ లీటర్ ధర రూ.97.39 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. కరీంనగర్లో ఇంధన ధరలు స్వల్పంగా తగ్గాయి. 46 పైసలు తగ్గడంతో కరీంనగర్లో పెట్రోల్ పై 15 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.109.39 కాగా, 14 పైసలు తగ్గడంతో డీజిల్ ధర రూ.97.56 అయింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఇంజినీరింగ్ శాఖలో పోస్టుల భర్తీకి ఆదేశాలు
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంజినీరింగ్ శాఖలో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేసింది.