Bharat Bundh Live News: భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది... రైతు సంఘాలు ప్రకటన

తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా భారత్ బంద్‌కు సంబంధించి జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 27 Sep 2021 07:53 PM

Background

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఈ భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. భారత్‌ బంద్‌కు దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా భారత్ బంద్‌కు సంబంధించి జరిగే...More

భారత్ బంద్ ప్రశాంతం

దేశవ్యాప్తంగా భారత్​ బంద్ ప్రశాంతంగా ముగిసింది.​ తమ పోరాటానికి ఏడాది గడుస్తోన్న నేపథ్యంలో రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్​ ప్రభావం ఉత్తర భారతంలో ఎక్కువగా కనిపించింది. దిల్లీలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. దిల్లీ- గురుగ్రామ్​ సరిహద్దుల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో రైతులు రైల్వే ట్రాక్​లపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. పంజాబ్‌-హరియాణా సరిహద్దు ప్రాంతంలో జాతీయ రహదారిని రైతులు దిగ్భందించారు. హరియాణా రోహ్‌తక్‌, కర్నాల్‌ ప్రాంతాల్లోనూ ట్రక్కు, ద్విచక్ర వాహనాలను నిలిపి రాకపోకలను రైతన్నలు అడ్డుకున్నారు.