నిర్మల్: తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా కేంద్ర ప్రభుత్వమే ఎక్కువగా అభివృద్ధికి నిధులు కేటాయించిందని, అయినా ఇంకా రజాకార్ల పాలన కొనసాగుతూనే ఉందని అసోం సీఏం హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ అభివృద్ధి పరిచిన జాతీయ రహదారులపైనే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పాదయాత్రలు చేపడుతున్నారని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. బీజేపీ విజయ సంకల్ప బస్సు యాత్రలో భాగంగా మంగళవారం నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని స్థానిక ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం..విజయ సంకల్ప యాత్ర 5,500 కిలోమీటర్ల మేర సాగనుందని, మూడోసారి ముచ్చటగా మోదీనే ప్రధానమంత్రిగా చేసి, దేశం అభివృద్ధి పథంలో సాగాలనే ఉద్దేశంతో యాత్ర కొనసాగుతుందని హిమంత బిశ్వశర్మ తెలిపారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతుందని 2018 సంవత్సరంలో 6.8 శాతం ఓట్లు సంపాదించగా, 2023 లో 14.9 అయిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, వీళ్ల పాలన రజాకార్ల పాలనని, దీన్ని అంతం చేసే రోజులు వస్తున్నాయన్నారు. భారత ప్రజలు కాంగ్రెస్ ని తరిమి మోదీని తీసుకొచ్చారని, కేంద్రంలోని బీజేపీ సర్కార్ రామ మందిరం కలను సాకారం చేసిందన్నారు. ప్రస్తుతం ప్రజలు మోడీని 3వ సారి ప్రధానిగా తీసుకురావాలని పిలుపునిచ్చారు. దేశంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత మోదీదేనని కొనియాడారు.
Telangana: తెలంగాణలో ఇంకా రజాకార్ల పాలన కొనసాగుతోంది: అసోం సీఏం సంచలన వ్యాఖ్యలు
ABP Desam | 20 Feb 2024 10:10 PM (IST)
తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా కేంద్ర ప్రభుత్వమే ఎక్కువగా అభివృద్ధికి నిధులు కేటాయించిందని, అయినా ఇంకా రజాకార్ల పాలన కొనసాగుతూనే ఉందని అసోం సీఏం హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా కేంద్రం నిధులే ఎక్కువ: అసోం సీఏం
Published at: 20 Feb 2024 10:10 PM (IST)