Big Breaking News Live: లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 6న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 06 Oct 2021 10:17 PM

Background

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 6న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి....More

లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు

సంచలనం రేపిన యూపీ లఖింపూర్ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. యూపీ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సీబీఐతో దర్యాప్తు జరిపించాలని యూపీకి చెందిన ఇద్దరు లాయర్లు శివకుమార్ త్రిపాఠి, సీఎస్ పాండా సీజీఐ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు. ఈ క్రమంలో సీజేఐ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ హింసాత్మక ఘటనపై విచారణ చేపట్టనుంది.